హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన సిరికొండ మధుసూదనాచారి ఆదివారం పదవీ స్వీకార ప్రమా ణం చేశారు. శాసనమండలి చైర్మన్ ప్రొటెం వీ భూపాల్రెడ్డి తన చాంబర్లో ప్రమాణం చేయించారు. మం డలి నియమావళి పుస్తకాలు, గుర్తింపుకార్డు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని మధుసూదనాచారిని అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అంతకు ముందు గన్పార్క్ వద్ద అమరవీరులకు మధుసూదనాచారి నివాళి అర్పించారు.