హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ నామినేట్ చేశారు. ఈ మేరకు సంబంధిత ఫైల్పై శుక్రవారం గవర్నర్ సంతకంచేశారు. అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది.
సిరికొండ మధుసూదనాచారి.. 2014 నుంచి 2018 వరకు శాసనసభ స్పీకర్గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం విదితమే. టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం నుండి సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ సన్నిహితులలో ఒకరిగా ఆయనకు పేరుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో భూపాలపల్లి నియోజకవ్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ శాసన సభ తొలి స్పీకర్గా పనిచేశారు. అయితే 2018లో మరోసారి భూపాలపల్లి నుంచి బరిలో నిలిచిన మధుసూదనాచారి.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.