పెద్దపల్లి : దేశంలో ఇంధన వనరులను తీర్చడంలో సింగరేణి ( Singareni ) సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు,సిబ్బంది, అధికారులకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి వెన్నెముకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణలోని ఆరు జిల్లాల్లో లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాధారంగా ఉన్న సింగరేణిని కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా ఇతర రంగాలలోకి కూడా ప్రవేశించి, మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్మికులు శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని కోరారు.