హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సింగరేణి సోలార్ విద్యుత్ ఉత్పాదనలో మరో మైలురాయి నమోదైంది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జలాశయంలో 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ప్లాంట్ నిర్మాణ సారథ్యం వహించిన అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
ఇదే జలాశయంలో మరో 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సీఎండీ ఆదేశించారు. మొత్తం మూడు దశల్లో 300 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంస్థ సీఎండీ నిర్ణయించారు. దీనిలో భాగంగా మొదటి రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను ఇప్పటికే ప్రారంభించారు. మూడో దశలో నిర్మించే మొత్తం 81 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
దీనిలో భాగంగా మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోని రెండు జలాశయాలపై నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ డీ సత్యనారాయణరావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శేషారావు, ఎస్టీపీపీ చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఎస్కే సూర్, జీఎం(సోలార్) జానకీరామ్, ఎస్టీపీపీ జీఎం డీవీ సూర్యనారాయణరాజు, జీఎం (పర్చేజ్, ఎస్టీపీపీ) వై రాజశేఖర్రెడ్డి, డీజీఎం సీహెచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ విశిష్టతలు