జగిత్యాల : తెలంగాణ సాహిత్య శిఖరం జ్ఞానపీఠ అవార్డు గ్రహిత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి అని జగిత్యాల జిల్లా గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ గొల్లపెల్లి చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. తెలంగాణ సాహిత్య శిఖరంగా గజల్స్ ను విశ్వ వ్యాప్తం గావించి ముందు తరాలకు అందించ్చిన మహానుభావుడు సినారే అని కొనియాడారు. గురువారం సినారే జయంతి సందర్భంగా కళాశ్రీ సాహితీ వేదిక అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా గ్రంధాలయం ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు, స్వర్గీయ సినారే జయంతి పురస్కారం, కవి సమ్మేళనం నిర్వహించారు.
సినారే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దాదాపు 20 మంది కవులు, కవయిత్రులు సినారే జయంతిపై కవితా గానం వినిపించారు. ఉమ్మడి జిల్లా కరీంనగర్కు చెందిన వర్ధమాన కవి మాధవ్ గుర్రాల కు సినారే పురస్కారాన్ని సభికులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, గుర్రాల మాధవ్, కళాశ్రీ అడ్మిన్స్ మద్దెల సరోజన, అయిత అనిత, కల్లేపల్లి సరళ, డా.ఆర్. శ్యాంసుందర్, కొమురవెల్లి లక్ష్మీనారాయణ, పసుల రవికుమార్ – కరీంనగర్, కట్ల భాగ్యలక్ష్మి – మంచిర్యాల, రుద్రంగి కమల – జగిత్యాల, లక్కరాజు శ్రీలక్ష్మీ – జగిత్యాల తదితరులు హాజరయ్యారు.