ఉస్మానియా దవాఖాన పార్క్లో మొక్కలు నాటిన సజ్జన్సింగ్
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్లో సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్ సజ్జన్సింగ్ భాగస్వామయ్యారు. మంగళవారం ఆయన ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్తో కలిసి ఉస్మానియా జనరల్ దవాఖాన అఫ్జల్పార్క్లో మొక్కలునాటారు. అనంతరం ఆయన ఎస్జీపీసీ అమృత్సర్ మాజీ కార్యదర్శి సర్దార్ రూప్సింగ్, అమృత్సర్ ఖల్సా కళాశాల ఫైనాన్స్ కార్యదర్శి గున్బీర్సింగ్ తదితరులను నామినేట్ చేశారు.