హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 554
పోస్టులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించింది. పరీక్షకు పోలీస్శాఖ పకడ్బందీ ఏర్పాటు చేసింది.
ఉదయం నుంచి 9 గంటల నుంచి హాల్టికెట్లు, ఐడీ కార్డుల పరిశీలించి అభ్యర్థులను కేంద్రాల్లోకి
అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా 538 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగ్గా.. 91.32శాతం అభ్యర్థులు
హాజరయ్యారు. 2,25,759 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. మొత్తం 2,47,217 మంది దరఖాస్తు
చేసుకున్నారు.