హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): పర్యావరణ క్షీణతతో సమాజం ఎంతటి విపత్తును ఎదురొంటున్నదో..ఆడబిడ్డల నిష్పత్తి పడిపోతే అంతే ప్రమాదాన్ని ఎదురొంటుందన్న భావనతో రూపొందించిన ఓ షార్ట్ఫిల్మ్పై రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆ వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి స్ఫూర్తిగా నిలిచిన శ్యామ్సుందర్ పలివాల్ 30 ఏండ్లుగా చేస్తున్న కృషిని అభినందించారు. ఆడబిడ్డ పుడితే పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న వైనాన్ని కొనియాడారు.
రాజస్థాన్ రాష్ట్రంలో బలోత్రా జిల్లా పిప్లాంత్రికి చెందిన శ్యామ్సుందర్ సామాజిక ఉద్యమకారుడు. ఫాదర్ ఆఫ్ ఎకో ఫెమినిస్ట్గా పేరొందారు. ఆయన తన సొంత గ్రామంతోపాటు సమీప గ్రామాల్లో ఎకడ ఆడపిల్ల పుట్టినా ఆమె పేరిట 111 మొకలు నాటుతూ, ఇతరులతో నాటిస్తూ వస్తున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2021లో పద్మశ్రీతో సతరించింది.
పలివాల్ కృషిలో భాగస్వామ్యమైన ఆస్ట్రల్ ఫౌండేషన్ ఆయా గ్రామాల్లో నాటిన మొకల పరిరక్షణకు 13 కిలోమీటర్ల మేర పైపులైన్ను ఏర్పాటు చేసింది. తాజాగా దవాఖానలో అమ్మాయి పుడితే ఊరు ఊరంతా తరలిరావడం, వేడుకగా మొకలు నాటడంపై రూపొందించిన షార్ట్ఫిల్మ్ భావోద్వేగంతో కూడుకొని ఉన్నది. ఈ వీడియోను షేర్ చేసిన ఎంపీ సంతోష్కుమార్.. పలివాల్ కృషి అద్భుతమైనదని, స్త్రీ సాధికారత కోసం ఆయన చేస్తున్న ఈ యజ్ఞం కొనసాగాలని ఆకాంక్షించారు.