హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్(ప్రొడక్షన్) పీ రాధాకృష్ణకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. బీడీఎల్లో ప్రొడక్షన్ డైరెక్టర్గా ఉన్న రాధాకృష్ణకు క్షిపణుల తయారీలో 35 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. 1987లో బీడీఎల్లో ఉద్యోగం ప్రస్థానం ప్రారంభించారు. జూనియర్ మేనేజర్ నుంచి అదనపు సీఎండీ వరకు బీడీఎల్ అభివృద్ధిలో కీలకంగా పనిచేశారు.