హైదరాబాద్ : నేతాజీ గ్రంథ సమీక్షల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.100 నోటుపై సుభాష్ చంద్రబోష్ బొమ్మ వేయాలన్నారు. శిల్పకళావేదికలో నేతాజీ గ్రంథ సమీక్ష సమీక్ష నిర్వహించారు. ‘నేతాజీ గ్రంథ సమీక్ష’ పుస్తకాన్ని ఎంవీఆర్ శాస్త్రి రచించగా.. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పవన్ కల్యాణ్, డాక్టర్ పద్మజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంవీఆర్శాస్త్రిని ఇప్పటి వరకు మూడుసార్లు కలిశానన్నారు. నాకు మేధావులంటే భయం, నేను సగటు మనిషినన్నారు. ఎంవీఆర్ శాస్త్రి దాదాపు 20 పుస్తకాలు రచించారని, సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ.. పుస్తకాలను మాత్రం ఇవ్వనని చెప్పారు.
త్రివిక్రమ్ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానని, నేను సినిమా నటుడు అవ్వాలని అనుకోలేదని పవన్ అన్నారు. ప్రజాసేవలోకి రావాలని అనుకోలేదని చెప్పుకొచ్చారు. నేతాజీ అస్థికలు రెంకోజీ ఆలయంలో ఇంకా ఉన్నాయని, వాటిని భారత్కు తిరిగి తీసుకురావాలన్నారు. అలాగే అవి నేతాజీవేనా అవునా? కాదా? పరీక్షలు చేయాలన్నారు. ఇప్పటికీ మూడుసార్లు ప్రయత్నించినా కుదరలేదని, నేతాజీ అస్థికలు దేశానికి తీసుకురావాలని ప్రజలు కోరుకోవాలన్నారు. నేతాజీని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని, నేతాజీ అస్థికలు రెంకోజీ ఆలయంలో దిక్కులేకుండా ఉన్నాయన్నారు. నేతాజీ కోసం కొత్త తరం కదలాలని పిలుపునిచ్చారు. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అనీ, ఆయనను గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదన్నారు.
శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి గారు రచించిన నేతాజీ గ్రంథం సమీక్ష – JanaSena Chief Shri @PawanKalyan
Live Link: https://t.co/T8EvdZCam3
— JanaSena Party (@JanaSenaParty) March 24, 2022