నల్లగొండ : అధికారంలోకి రావాలి, దోచుకుతినాలి అన్నదే కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ప్రజల క్షేమం వారికి పట్టదు.టీఆర్ఎస్పై అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు వాళ్లకు వాల్లే తన్నుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యిందని ఎమ్మెల్సీ గుత్తా అన్నారు.
గురువారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కలహాలు కప్పిపుచ్చుకునేందుకేప్రభుత్వం పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు మానడం లేదు. ఉత్తమ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
మళ్ళీ అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రోజురోజుకీ పతనం అవుతున్నది. అందుకే ఉనికి కోసం ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉండి ధాన్యం కొనాలని కేంద్రాన్ని అడిగే దమ్ము లేదన్నారు. మేము కోదాడ, జడ్చర్ల రహదారిని కోట్లడి తెచ్చినాం.
రెండు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించామని గుత్తా తెలిపారు.పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్లు అభివృద్ధి చేసామం. సీఎం కేసీఆర్ రూ.1500 కోట్లతో లిఫ్ట్ లు మంజూరు చేశారు.
టేల్ ఎండ్ భూములకు ఇవ్వాళ సాగు నీరు అందుతుంది. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి కనపడటం లేదు. ఇంకా కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో కూడా తన్నుకు చస్తున్నారు.
కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అందుకే కుమ్ములాటలు ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 40 వెల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న ఘనత మా ప్రభుత్వానిది అన్నారు.
బీజేపీ వల్ల పరిస్థితి కూడా అద్వాన్నంగా తయారయింది.వాళ్లలో వల్లే గ్రూప్ లుగా ఏర్పడి కొట్టుకుంటున్నారు.ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం అన్నారు. జాతీయ పార్టీలను ప్రజలు నమ్మడం లేదన్నారు.
కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు యామ దయాకర్ పాల్గొన్నారు.