హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర హోంశాఖ ఇచ్చే ‘జాతీయ ఉత్తమ పోలీస్స్టేషన్’ అవార్డు కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు పోటీ పడాలని డీజీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కమిషనరేట్ల ఎస్పీ లు, ఎస్హెచ్వోలతో డీజీపీ అంజనీకుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డులు పొందేందుకు ఎస్హెచ్వోలు మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో, రాష్ట్రంలో మెరుగైన పోలీసింగ్ విధానాలను అనుసరించడానికి 30 స్టేషన్లను ఎంపిక చేశామని వెల్లడించారు. ఈ 30 పోలీస్ స్టేషన్లతో సహా అన్ని పోలీస్ స్టేషన్లు 2024 జాతీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు కోసం పోటీ పడాలని కోరారు.
80 శాతం మారులను సీసీటీఎన్ఎస్ డాటా ఆధారంగా నిర్ణయిస్తారని, మిగిలిన 20 శాతం మారులను పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పన, పౌరుల ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్ణయించనున్నట్టు డీజీపీ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మూడు పోలీస్ స్టేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని డీజీపీ తెలిపారు. మహిళలపై నేరాలు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తుతెలియని మృతదేహాలు, ఇతర నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చార్జిషీటును సకాలంలో దాఖలు చేయాలని సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ శిఖాగోయల్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఐజీలు కమలాసన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.