సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ అద్భుత ప్రతిభ
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 6: వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన అద్భుత ప్రతిభ చాటారు. అగ్గిపెట్టెలో ఇమిడే, సూది బెజ్జంలో దూరే చీరలను నేసిన హరిప్రసాద్ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలను పట్టువస్ర్తాలపై నేశారు. తాజాగా అగ్గిపెట్టెలో దూరే షర్ట్తోపాటు లుంగీని తయారుచేశారు. మల్బర్ సిల్క్ను ఉపయోగించి మగ్గంపై నేసిన ఈ వస్ర్తాలు వ్యక్తులు ధరించేందుకు వీలుగా ఉంటాయని హరిప్రసాద్ తెలిపారు. వీటి తయారీకి పదిరోజులు సమయం పట్టిందని, వీటిలో షర్ట్ 100 గ్రాములు, లుంగీ 140 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు హరిప్రసాద్ ప్రతిభను గుర్తించి అభినందిస్తున్నారు.