వరంగల్ : రాష్ట్రంలో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.8,715 పలికినట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్లో ఇదే రికార్డు ధర అని చెప్పారు. కాగా, ఈ సారి పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటంతో తెలంగాణ రైతన్నకు మంచి ఆదాయం వస్తున్నది. ఈ మూడేళ్లలో ఎన్నుడూ లేనంత ధర పలుకుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు.