కెరమెరి, ఏప్రిల్ 21: ఇత్తడి కళాఖండాల హస్తకళాకారుడు, శిల్పిగురు అవార్డుగ్రహీత కోవ నానేశ్వర్ (71) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బంధువులు కెరమెరి దవాఖానలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మరణిం చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కెస్లాగూడకు చెందిన కోవ.. 2015 డిసెంబర్ 9న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా శిల్పిగురు అవార్డు అందుకున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.