హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షెఫాలీ బీ శరణ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిగా శరణ్ పలు శాఖల్లో పనిచేశారు. మూడు దశాబ్దాల పాటు కేంద్రప్రభుత్వంలోని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు.