హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్గా రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ షకీల్ అహ్మద్ను సంస్థ జాతీయ అధ్యక్షుడు వినయ్కుమార్ నియమించారు. వైస్చైర్మన్గా నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనీజా గుత్తికొండ, కార్యదర్శిగా ఎన్సీసీ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ ఫిలిప్ జాషువా, కోశాధికారిగా ఢిల్లీ పబ్లిక్స్కూల్ పీఆర్వో నోయల్ రాబిన్సన్, జాయింట్ సెక్రటరీగా జాకబ్ రోస్ను నియమించారు.