న్యూఢిల్లీ, ఆగస్టు 30: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు అవసరమని ఏఐఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ లేకుండా అఖిలేశ్ యాదవ్ రాజకీయ వ్యూహం అసంపూర్ణంగానే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్కు సలహా ఇస్తూ ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అధినేత తన ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసుకోవాలంటే ఓవైసీ పార్టీతో సహకారం అవసరమని సూచించారు.
అంతేగాక అఖిలేశ్ యాదవ్ తన సొంత సామాజిక వర్గం మద్దతుపైనా దృష్టి సారించాలని చౌహాన్ సలహా ఇచ్చారు. ఆ వర్గంలోని కొంతమంది బీజేపీ వైపు మళ్లుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను ఏకం చేసేందు కు యూపీ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏఐఎంఐఎం నేత వ్యాఖ్యలు వెలువడ్డాయి. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల చుట్టూ తమ రాజకీయ వ్యూహాన్ని రూపొందించడానికి సమాజ్వాదీ పార్టీ ప్రయత్నిస్తున్నది.