హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్, ఏప్రిల్ 29: కాకతీయ వర్సిటీలో ఆదివారం సెక్యులర్ రైటర్స్ ఫోరం (సమూహ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో రచయితలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులపై జరిగిన భౌతికదాడులను సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖం డించారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సదస్సు జరుగుతు న్న సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు బ్యానర్లు చించివేసి, అస భ్య పదజాలంతో దూషిస్తూ వారి నుం చి పుస్తకాలను లాగేసుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు ఏబీవీపీ దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరి స్తూ కవు లు, మేధావులు, రచయితలపై మతోన్మాదులు భౌతికదాడులు చేయడం శోచనీయమని ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా స్ మండిపడ్డారు. సోమవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకతీయ వర్సిటీలో జరిగిన దాడి ప్రజల స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నట్టు తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడుల సంస్కృతి మంచిది కాదని తెలిపారు.