నర్సాపూర్: రాష్ట్రంలో తొలి ‘గో కార్ట్ రన్వే’ ఏర్పాటు చేశామని, ఈ ట్రాక్ ఉన్న ఏకైక ఇంజినీరింగ్ కాలేజీ తమదేనని బీవీఆర్ఐటీ కళాశాల చైర్మన్ విష్ణురాజు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులోని బీవీఆర్ఐటీ కాలేజీలో ఏ టీవీ గోకార్ట్ రన్వే ట్రాక్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ తదితర గ్రూప్ల విద్యార్థులకు ఈ రన్వే చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
రాబోయే రోజుల్లో విద్యార్థులు డిజైన్ చేసి, రూపొందించిన గోకార్ట్ వాహనాలను పరీక్షించేందుకు వీలుగా ఈ ట్రాక్ను ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులకు ఆటోమొబైల్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ ఆదిత్య, కళాశాల వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.