Traffic Challan | ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పంద వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు అయ్యాయని.. దీంతో రూ.8.44కోట్ల ఆదాయం సమకూరిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ.2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా 1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93వేల చలాన్ల ద్వారా రూ.76.79 లక్షల ఆదాయం చేకూరిందని పేర్కొన్నాయి.
కాగా, పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో గడువులోగా కట్టేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు. దీంతో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతోంది.