Vinayaka Chavithi | హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వినాయక చవితి పర్వదినాన్ని భాద్రపద శుక్ల చతుర్థి అయిన సెప్టెంబర్ 18న సోమవారమే జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ తెలిపింది. 18న ఉదయం 9.58 గంటలకు చవితి ఆరంభమై 19న ఉదయం 10.28 గంటలకు ముగుస్తుందని, నవరాత్రులను అదేరోజు ఆరంభించాలని విద్వత్సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రతి ఏటా పండుగల నిర్ణయంసహా ధర్మ, ఆగమ శాస్త్ర విషయాల్లో విద్వత్ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, ధర్మశాస్ర్తాలకు అనుగుణంగానే పండుగలను నిర్ణయిస్తున్నామని పేర్కొన్నారు.