ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచం మొత్తం రష్యా -ఉక్రెయిన్ యుద్ధంవైపే చూస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్కుమార్ ‘సే నో టు వార్.. స్ప్రెడ్ లవ్’ అని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి భూమిని అందంగా తీర్చిదిద్దాలని సూచిస్తూ గురువారం ట్వీట్ చేశారు. ‘యుద్ధం!!! చివరిలో ఎవరూ విజేత కారు. ఎవరైనా విజేత అని చెప్పుకుంటే, అది కేవలం పేరు కోసమే. యుద్ధానికి వెళ్లడంలో అర్థం లేదు! ప్రేమ, ఆప్యాయతతో భూమిని మరింత అందంగా తీర్చిదిద్దుదాం. సే నో టు వార్, స్ప్రెడ్ లవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ’అని పేర్కొన్నారు. తుపాకీకి నీళ్లుపోస్తున్న బాలుడు.. తుపాకీ నుంచి మొక్కలు చిగురిస్తున్నట్టుగా ఉన్న కార్టూన్ను జత చేశారు. ఇది నెటిజన్లను ఆకట్టుకొంటున్నది.