బేగంపేట్, మే 27: జూలై 17, 18వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భక్తులంతా సమిష్టిగా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. అన్ని దేవాలయాలకు నిధులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టంచేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా గత రెండు ఏండ్లుగా బోనాల ఉత్సవాలు సరిగ్గా నిర్వహించలేదని, ఈసారి ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి, అనువంశిక చైర్మన్ సురిటి కామేశ్ తదితరులు పాల్గొన్నారు.