హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బీ-ఫార్మసీ, ఫార్మా-డీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి ఎంసెట్ (బైపీసీ) తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజే 540 మంది ఈ కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఈ నెల 19 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 20 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ నెల 23న తుది విడత సీట్లను కేటాయిస్తారు. మొదటి విడుత కౌన్సెలింగ్ తర్వాత కేవలం 194 సీట్లు మాత్రమే మిగిలాయి.