హైదరాబాద్ : వచ్చే నెల 2వ తేదీన గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్కేవీబీఆర్ బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ ‘రన్ ఫర్ పీస్’ సెకెండ్ ఎడిషన్ను నిర్వహిస్తోంది. గురువారం అరణ్యభవన్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ‘రన్ ఫర్ పీస్ జెర్సీ, మెడల్స్ను ఆవిష్కరించారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి, ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ను నిర్వహిస్తున్న బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భరత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి రన్లో పాల్గొనడానికి రెండు వేల మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని వెల్లడించారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్ను నిర్వహిస్తున్నామని, ఉదయం 6 గంటలకు 10కే రన్ను ప్రారంభించనున్నామని తెలిపారు.
ఈ రన్కు టైటిల్ స్పాన్సర్గా ఎన్ఎన్ఆర్ డ్రీమ్ స్కేప్ సంస్థ వ్యవహరిస్తోందని.. రన్ను విజయవంతంగా నిర్వహించేందుకు 500 మంది వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక, అదే రోజు డాక్టర్ తేజశ్వినీ మనోజ్ఞ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సెక్రెటరీ పీ బాల కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.