హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, యాత్రా స్థలాలకు నడిపేందుకు రైల్వేశాఖ ప్రారంభించిన ‘భారత్ గౌరవ్’ రైళ్లు టూరిజం సంస్థల చేతుల్లోకే వెళ్లనున్నాయి. రైళ్ల నిర్వహణను ప్రభు త్వ, ప్రైవేటు టూరిజం, ధార్మిక సంస్థల చేతు ల్లో పెట్టడానికి అధికారులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. గౌరవ్ రైళ్ల నిర్వహణను టూ రిజం సంస్థలకు అప్పగించే విధివిధానాలపై పలు సంస్థలతో రైల్వే అధికారులు బుధవారం చర్చలు జరిపారు. టీటీడీ, తెలంగాణ పర్యాట క సంస్థ, ఐఆర్సీటీసీ, ఏపీ పర్యాటక సంస్థ, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా సంస్థలతో రైల్వే భవన్లో నిర్వహించిన సమావేశంలో ప్రయాణమార్గాలు, చార్జీలకు సంబంధించి ప్రైవేటు సంస్థలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చనే సంకేతాలిచ్చారు. ఒకటిరెండు నెలల్లో మార్గదర్శకాలు ఖరారు కాగానే ప్రయాణ మార్గాలవారీగా టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ట్రావెల్ సంస్థ ముందుగా రైల్వేకు కొంతమొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రైలును అద్దెకుతీసుకోవచ్చు. 14 బో గీలు కచ్చితంగా అద్దెకు తీసుకోవాలి. ఎక్కువ సంస్థలు పోటీపడితే టెండర్లు పిలిచి కేటాయిస్తారు. సమావేశంలో భారత్ గౌరవ్ నోడల్ అధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.