హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇది 2019-20లో నమోదైన ఆదాయం (రూ.4,119.44) కంటే రూ.881.37 కోట్లు అధికమని ప్రకటించారు.
కొవిడ్ లాక్డౌన్ తర్వాత ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను పునఃప్రవేశ పెట్టినప్పటి నుంచి ఎస్సీఆర్ జోన్లో నిరంతరం ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నది.