సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 23: చందమామను భారత్ సక్సెస్ఫుల్గా చేరుకోవడంలో యాదా ద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన శాస్త్రవేత్త సిరిపోతు శ్రీరంగం భాగస్వామ్యం కూడా ఉండడం విశేషం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 2010 నుంచి ఇంజినీరింగ్ డిజైనింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లాంచ్ వెహికల్ విభాగంలో సైంటిస్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.13 సంవత్సరాలుగా ఇస్రోలో సైంటిస్ట్గా పని చేస్తున్నట్లు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉందని నమస్తే తెలంగాణకు తెలిపారు.
చిన్నతనంలోనే కాళ్లు కోల్పోయినా…
శ్రీరంగానికి రెండేండ్ల వయస్సు ఉన్నప్పుడు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఇంజక్షన్ ఇప్పించారు. అది వికటించడంతో ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దివ్యాంగుడు అయిన్పటికీ మెండైన విశ్వాసంతో చదువులో రాణించేవారు.