జగిత్యాల : సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పాండులోజి నవదీప్ (11) 8వ తరగతి చదువుతున్నారు. స్నేహితులు భీమ్లానాయక్ నాయక్ చిత్రం చూసేందుకు అతని మిత్రులు అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేసుకుంటున్నారని, తనకు రూ.300 ఇవ్వాలని నవదీప్ తండ్రిని నరసయ్యను అడిగాడు.
దీనికి తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన నవదీప్ తలుపులు వేసుకొని.. గది పక్కనే ఉన్న బాల్కనీలో లుంగితో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినిమా టికెట్ డబ్బులు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నెలకొన్నది.