కరీంనగర్ :అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన కోసం తన జీవితాన్ని దారబోసిన మహాత్మా జ్యోతిబాఫూలే(Jyothiba phule) స్ఫూర్తితో సీఎం కేసీఆర్(CM KCR) అనేక పథకాలకు అంకురార్పణ చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో జ్యోతిరావుఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజన విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కీంను(Overseas scheme),దళితబంధు(Dalita bandu), రైతుబంధు(Raitubandu) అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.కుల వ్యవస్థ కారణంగా మేధావులెందరో ఆర్థికంగా,సామాజికంగా వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేయడానికి అనాటి నుంచే కృషిచేసిన మహనీయడు పూలే అని కొనియాడారు. తన ఇంటినుంచే స్త్రీ విద్యకు పునాదివేసి, భార్య సావిత్రీబాయికి చదువుచెప్పించారని గుర్తు చేశారు.
దేశంలో ఎన్నో సంసరణలను తీసుకువచ్చిన పూలేకు భారతరత్న(Bharat ratna) అవార్డును ప్రధానం చేయాలని గతంలో తాను పార్లమెంట్లో ప్రస్తావించినట్లు తెలిపారు. . కానీ కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, కలెక్టర్ కర్ణన్, మేయర్ వై. సునీల్రావు, విజయ, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, శాతవాహన విశ్వవిద్యాయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మల్లేశ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.