హైదరాబాద్ : తెలంగాణలోని మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ తాజాగా విడుదలైంది. 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ను తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) విడుదల చేసింది.
ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 9న మైనారిటీ గురుకులాల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. మే 10న మైనారిటీ గురుకులాల 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. మే 21న మైనారిటీ గురుకులాల ఇంటర్ ప్రవేశాల పరీక్షను నిర్వహించన్నారు.