హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 29న (సోమవారం) ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విచారణ, మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఉంటుంది.
అయితే అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్ దశలో న్యాయవాదులు కీలక వాదనలు వినిపించనున్నారు. అక్టోబర్ 1న (బుధవారం) మరోసారి అదే కేసులపై విచారణలు కొనసాగనున్నాయి. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారు. స్పీకర్/చైర్మన్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ జరపనున్నారు.
కల్వకుంట్ల సంజయ్ vs T. ప్రకాశ్ గౌడ్
చింత ప్రభాకర్ vs కేల యాదయ్య
చింత ప్రభాకర్ vs గుడెం మహిపాల్ రెడ్డి
పల్లా రాజేశ్వర్ రెడ్డి vs బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Schedule 2