హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలను వెంటనే విభజించాలని ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు తెలంగాణకు నోటీసులు పంపింది. ఈ సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్ల మేరకు ఉన్నదని, 91 శాతం తెలంగాణలోనే ఉన్నాయని ఏపీ పేర్కొన్నది.