బిచ్కుంద, అక్టోబర్ 7: హరితనిధికి నిధులివ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్నగర్ సర్పంచ్ అనూయ లక్ష్మీనారాయణ స్పందించారు. తన ఏడాది గౌరవ వేతనం రూ.60 వేలు విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును త్వరలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు అందజేస్తానని తెలిపారు. చెట్ల పెంపకానికి సీఎం కేసీఆర్ హరితనిధిని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ హరితనిధికి విరాళాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.