హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ అనుబంధ రంగాల కార్పొరేషన్లపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత పదేండ్లలో నిర్వహించిన కార్యకలాపాల పూర్తి సమాచారాన్ని అందించాలని బుధవారం కార్పొరేషన్లకు లేఖలు రాసింది. వ్యవసాయ కార్పొరేషన్లపై విచారణ చేపట్టాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా దృష్టి సారించారు.
సంస్థ కార్యకలాపాలు ఏంటి?, ఐదేండ్లలో ఏం పనులు చేశారు?, అప్పులెన్ని, అస్తులెన్ని, ప్రభుత్వం వద్ద పెండింగ్ పనులేమైనా ఉన్నాయా? వంటి వివరాలను సమర్పించాలని కార్పొరేషన్లను ఆదేశించారు. ఈ విచారణ వెనుక గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యకలాపాలు తెలుసుకోవడం, కార్పొరేషన్ల పనితీరును మరింత మెరుపర్చడం వంటి కారణాలుండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి.