హైదరాబాద్, ఏప్రిల్7(నమస్తే తెలంగాణ): ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారిగా సంజయ్కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సంజయ్కుమార్ ఝాకు కార్యాలయం, సిబ్బంది, వాహనాన్ని కేటాయించింది. ఝా సీఎం పీఆర్వోగా రెండేండ్లు విధులు నిర్వర్తిస్తారు. ఆయనకు నెలకు రూ. 2 లక్షల వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.