న్యూఢిల్లీ: ప్రసిద్ధ కూచిపూడి కళాకారులు రాజారెడ్డి, రాధారెడ్డిలను అకాడమీ రత్నలుగా సంగీత నాటక అకాడమీ ఎంపిక చేసింది. 2022, 2023 సంవత్సరాలకు గానూ ఆరుగురికి ఫెలోషిప్ (అకాడమీ రత్న), 92 మందికి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందచేయనున్నట్టు అకాడమీ ప్రకటించింది.
రాజారెడ్డి, రాధారెడ్డితోపాటు జానపద కళాకారుడు, రచయిత వినాయక్ ఖేదేకర్, వైణిక విద్వాంసుడు ఆర్ విశ్వేశ్వరన్, కథక్ నృత్య కళాకారిణి సునయన హజారీలాల్, రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్, ప్లే రైట్ డీపీ సిన్హాలకు కూడా అకాడమీ ఫెలోషిప్ దక్కింది. ఫెలోషిప్ పొందిన వారికి రూ.3 లక్షల బహుమతి ఇవ్వనుండగా.. అకాడమీ పురస్కారం పొందిన వారికి రూ.లక్ష బహుమతిని ఇస్తారు. ఈ పురస్కారాలను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఓ ప్రత్యేక కార్యక్రమంలోఅందజేయనున్నారు. 2022, 2023 సంవత్సరాలకు గానూ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలకు 80 మందిని అకాడమీ ఎంపిక చేసింది. వీరిలో ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున బహుమతి ఇస్తారు. యువ పురస్కారాలను సంగీత్ నాటక అకాడమీ చైర్మన్ అందజేస్తారు.