కొల్లాపూర్, జూలై 16: తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల గుండా సప్తనదుల సంగమ ప్రదేశంలో పారుతున్న కృష్ణానది నీటిలో సంగమేశ్వరాలయం మునిగింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరంలో శ్రీలలితాసంగమేశ్వరస్వామి ఆలయంలో చివరిసారిగా శుక్రవారం గంగాదేవికి మంగళహారతులు ఇచ్చినట్టు ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ శనివారం తెలిపారు. అయితే సంగమేశ్వరస్వామి వారికి జలాధివాసంలోకి వెళ్తున్న సందర్భంగా రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, మహా మంగళహారతి పూజలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 30న సంగమేశ్వరాలయం జలాధివాసంతో నుంచి బయటపడి ఆ మరుసటి రోజు జనవరి 31న తొలి సోమవారంతో మొదలైన పూజలు మొత్తం 24 సోమవారాలు (ఐదునెలల 26 రోజులు) పూజలందుకొన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు గాలిగోపురంతో సహా ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోనున్నది. నది నీటి నుంచి సంగమేశ్వరాలయం పూర్తిగా బయటపడేందుకు మరో ఆరు నెలల వ్యవధిపడుతుందని భక్తులు చెప్తున్నారు.
నందికొండ: వాతావరణం అనుకూలించక నందికొండ హిల్కాలనీ లాంచీ స్టేషన్కే పరిమితమైన లాంచీలు మూడు రోజుల తర్వాత శనివారం ప్రారంభయ్యాయి. యధావిధిగా జాలీ ట్రిప్పులు, నాగార్జున కొండకు లాంచీలను నడుపుతామని శనివారం నాగార్జునకొండకు ఒక ట్రిప్పు నడిపామని లాంచీస్టేషన్ అధికారులు తెలిపారు.