New Fire Station | కొత్తగా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటుకానున్న ములుగు జిల్లాలోని ఏటూరు నాగారానికి ప్రభుత్వం ఫైర్ స్టేషన్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా 34 మంది సిబ్బందిని కేటాయించింది. ఇందులో అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ పోస్టు, రెండు స్టేషన్ ఆఫీసర్ పోస్టులు, నాలుగు లీడింగ్ ఫైర్మెన్ పోస్టులను మంజూరు చేసింది. అలాగే ఐదుగురు డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు, 20 ఫైర్మన్, ఒక జూనియర్ అసిస్టెంట్, స్వీపర్ పోస్టుతో కలిసి 34 మంది సిబ్బందిని కేటాయిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. ఏటూరు నాగారం మండల కేంద్రాన్ని ఇటీవల రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ శనివారం ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ములుగు డివిజన్లో గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనున్నది. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా ఉత్తర్వులు జారీ చేయనున్నది.