Jampanna | తాడ్వాయి, ఫిబ్రవరి 18: మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో జంపన్నకు ఆదరణ కరువైంది. చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు, సారలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జంపన్నవాగు జాతరలో ప్రత్యేక ఆదరణ కలిగి ఉంది. భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించాక తల్లుల దర్శనానికి వెళ్తారు.
సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు మాత్రమే దేవాదాయశా ఖ అధికారులు జాతర నిర్వహిస్తున్న నే పథ్యంలో.. తాడ్వాయి మండలం కన్నెపల్లికి చెందిన పోలెబోయిన సత్యం, ఆ యన తమ్ముడు శ్రీనివాస్, కుమారు డు సురేశ్ కలిసి సుమారు 2లక్షలకు పైగా ఖర్చులతో జంపన్నను సంపెంగవాగు ఒడ్డున గద్దెపై చేర్చి జాతర నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించి జం పన్న జాతరనూ నిర్వహించాలని పోలెబోయిన వంశీయులు కోరుతున్నారు.
జంపన్న రాకతోనే జాతర షురూ..
మేడారం మహాజాతర ప్రారంభానికి ముందు జంపన్నను పోలెబోయిన వంశీయులు గద్దెకు తీసుకురావడం ఆనవాయితీ. 2024 మహాజాతరకు ఫిబ్రవరి 20న మంగళవారం సాయంత్రం జంపన్న గద్దెపైకి చేరనున్నాడు. ఆ తర్వాత 21న సారలమ్మ, 22న సమ్మక్క దేవతలు గద్దెకు చేరుకుంటారు. జంపన్న గద్దెను చేరాక బుధవారం సారలమ్మ జంపన్నను పలుకరించుకుంటూ వాగు నీళ్లలో నడుచుకుంటూ గద్దెపైకి చేరుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.