పది మంది ఉద్యోగులకు జరిమానా
నిర్లక్ష్యంపై మున్సిపల్ శాఖ సీరియస్
హైదరాబాద్, మార్చి 8 : పట్టణాలు, నగరాల్లో ఇంటి అనుమతులపై తనిఖీ నివేదికలు ఇవ్వడంలో జాప్యం చేసిన 10 మంది ఉద్యోగుల వేతనాలను కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరి వేతనంలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కోత విధించాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ కలెక్టర్లకు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. టీఎస్బీపాస్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందేందుకు వచ్చే దరఖాస్తులను స్థానికంగా అధికారులు పరిశీలించి మున్సిపల్ శాఖకు వెంటనే నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తులను మూడు వారాల వరకు పెండింగ్లో పెడుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులు, ఉద్యోగుల వేతనం నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కమిషనర్లు, అధికారులకు జరిమానా విధించిన ప్రభుత్వం.. ఆ తర్వాత హెచ్ఎండీఏ అధికారులకు, తాజాగా నీటిపారుదల, ప్రణాళిక విభాగం అధికారులకు ఫైన్ వేసింది.