హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతభత్యాలను శుక్రవారం (5వ తేదీనే) చెల్లించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచనల మేరకు ప్రణాళికబద్ధంగా బస్సులను నడపడంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం పెరగడం, ప్రభుత్వ బడ్జెట్ సహకారంతో మొదటివారంలోనే జీతాలు చెల్లించినట్టు ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా సమయంలో రోజుకు రూ.2 కోట్లకు పడిపోయిన సంస్థ ఆదాయాన్ని.. ప్రస్తుతం రోజుకు రూ.11 కోట్లకు పెంచగలిగామన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా లో రూ.32 కోట్లు జమచేసినట్టు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులున్నా కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నందుకు టీఎంయూ నేత థామస్రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ కవితను కలిసి విన్నవించామని చెప్పారు. వారు స్పందించి ఇచ్చిన ఆదేశాలతో 5వ తేదీనే కార్మికులకు జీతాలు రావడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినవారిలో టీఎం యూ నాయకులు కమలాకర్గౌడ్, ఎల్ మారయ్య, బీ యాదయ్య, బీ నరేందర్, జీపీఆర్ రెడ్డి తదితరులు ఉన్నారు.