నల్లగొండ: అమెరికాలోని మేరీలాండ్లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్ (Sai charan) మృతిచెందారు. సాయి చరణ్ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయులు కాల్పులు జరిపారు. దీంతో సాయి చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు తీవ్ర విచారంలో మునిగిపోయారు.