హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
తన పదవీ కాలాన్ని పొడిగించిన సీఎం కేసీఆర్కు పల్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశంతో రైతులకు సేవతోపాటు రాష్ట్ర వ్యవసాయరంగం బలోపేతానికి మరింత కృషిచేస్తానని తెలిపారు.