కొండాపూర్, మార్చి 17: వినూత్నంగా.. ఆలోచించేలా.. హృదయాలు స్పందించేలా అద్భుత పెయింటింగ్స్తో కల్వకుంట్ల రియాన్షి (అలేఖ్య) ఆకట్టుకున్నది. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంవైపీ 9, 10 గ్రేడ్ విద్యార్థుల పెయింటింగ్స్ను మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ప్రదర్శించారు. ఇందులో రియాన్షి వేసిన పెయింటింగ్స్ అబ్బురపర్చాయి. మహి ళ కండ్ల స్థానంలో సాలెపురుగులు.. చెవుల్లో సీతాకోకచిలుకలు.. నోటికి అడ్డుగా మాస్క్తో ఉన్న చిత్రం ద్వారా మహిళ తన ఆలోచనలు, భావాలను వ్యక్తపరిచే విధానాన్ని అద్భుతంగా వివరించింది. సీతాకోకచిలుకలు పరివర్తన, ఆశను సూచిస్తే, సాలెపురుగులు పట్టుదలను సూచిస్తున్నట్టు తెలియజేసింది. అనువును గాని చోట మహిళ తన భావాలను వ్యక్తపరచకుండా సూచించేలా మాస్క్ను అడ్డుగా ఉంచినట్టు అనిపిస్తున్నది. దీంతో పాటుగా విభిన్న రకాల భావోద్వేగాలను సూచించేలా వేసిన హృదయం ఆలోచింపజేసింది. ప్రేమ, బాధ, ధైర్యం, భక్తి, శక్తి తదితర అంశాలతో మానవ స్పందనలను తెలియజేసేలా సూచిస్తూ వేసిన చిత్రం ప్రత్యేకార్షణగా నిలిచింది.