హైదరాబాద్ : కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నూతనంగా ప్రభుత్వం నియమించిన కలెక్టర్లు మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ఆర్వీ కర్ణన్, ఖమ్మం జిల్లా కలెక్టర్గా వీపీ గౌతమ్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అభిలాష అభినవ్ బాధ్యతలు స్వీకరించారు.
కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ను కరీంనగర్కు బదిలీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ కే శశాంకను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ను ఖమ్మంకు బదిలీ చేసింది. మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాషకు జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.