హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలంసహా ఇతర శైవక్షేత్రాల దర్శనానికి వెళ్లే ప్రయాణికులు ఒకే చోట 30 మంది ఉంటే వారివద్దకే బస్సు పంపుతామని ప్రకటించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ట్వీట్చేశారు. బస్సు సర్వీసులు కావాల్సిన భక్తులు 040-30102829, 040-68153333 టోల్ఫ్రీ నంబర్ల ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.