హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ.. ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నది. కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా తార్నాక దవాఖానను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించింది. ఇకడ కొత్తగా నిర్మించిన 4 సూపర్ స్పెషాలిటీ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతోపాటు 15 పడకల మెడికల్, 10 పడకల సర్జికల్ ఐసీయూలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ప్రారంభించారు. ఆపరేషన్ థియేటర్లలోని వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ఏ సంస్థ అయినా బాగుంటందని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.కాగా, తొలిసారిగా హెల్త్ వలంటీర్ల వ్యవస్థకు సంస్థ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 50 వేల మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు హెల్త్ వలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నది. గ్లూకోమీటర్, బీపీమీటర్, డిజిటల్ థర్మామీటర్తో కూడిన కిట్లను వలంటీర్లకు సజ్జనార్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జే (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) సంగ్రామ్సింగ్జీ పాటిల్, సీపీఎం కృష్ణకాంత్, సీసీవోఎస్ విజయభాసర్, సీసీఈ రాంప్రసాద్, దవాఖాన ఓఎస్డీ సైదిరెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.