పశు వ్యాక్సిన్కు వాడే ఆయిల్ పేరిట టోకరా
విదేశాల్లోని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పశువుల వ్యాక్సిన్ తయారీకి ఉపయోగపడే ఆయిల్ పంపుతామంటూ హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ను సైబర్ నేరగాళ్లు నిలువునా ముంచేశారు. ముఠాగా ఏర్పడి రూ.11.90 కోట్లు దోచుకున్నారు. బా ధితులు, పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ సీవీ రావుకు ఫేస్బుక్లో గీతా నారాయణ పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తమ వద్ద పశువుల వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించే అగ్రోమెటిజమ్ ఆయిల్ తక్కువ ధరకు దొరకుతున్నదని, దానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుందని చెప్పింది. మరోవైపు, తాము ఆ యిల్ కొంటామని బెంజిమెన్ పేరిట ఒక వ్యక్తి సీవీరావుకు మెయిల్ పంపించాడు. ముంబయిలో లీటర్ ఆయిల్ రూ.10.8 లక్షల (14,625 డాలర్ల)కు దొరుకుతుందని, తాము అమెరికా, లండన్లో రూ.16.3 లక్షల (22 వేల డాలర్ల)కు కొంటామని బెంజిమెన్ నమ్మించాడు. మహారాష్ట్రలోని రాయ్గఢ్లో తమ ప్లాంట్ ఉన్నదని అక్కడినుంచి ఆయిల్ పంపిస్తామని గీతా నారాయణ ద్వారా పరిచయమైన లక్ష్మి అనే మహిళ సీవీరావుతో మా ట్లాడింది.
ఆయన ఒక లీటర్ ఆయిల్కు ఆర్డర్ ఇచ్చారు. కనీసం 350 లీటర్లు ఇస్తే భారీ లా భాలొస్తాయి, ఒక బ్యాచ్ వ్యాక్సిన్ను తయారు చేసుకోవచ్చని ఆశ పుట్టించారు. ఇది తమకూ కలిసి వస్తుందని నమ్మించారు. కొరియర్లో ఆయిల్ పార్సిల్ వస్తుందని నమ్మబలికారు. సైబర్నేరగాళ్లు చెప్పినట్లు సీవీరావు తన బ్యాంకు ఖాతా నుంచి డాలర్ల రూపంలో దుబాయ్లో ఉన్న మూడు, అమెరికాలో ఉన్న ఆరు బ్యాంకు ఖాతాలకు రూ.11.9 కోట్లకు (16.11 లక్షల డాలర్లు)పైగా పంపించారు. పూర్తి డబ్బు చెల్లిస్తేనే ఆయిల్ వస్తుందని, దానికి వ్యాట్, ఇతర బిల్లులు చెల్లించాల్సి ఉ న్నదని ఇంకో 2.50 లక్షల డాలర్లు కావాలని నేరగాళ్లు ఒత్తిడి తెచ్చారు. మోసపోయినట్టు తెలుసుకున్న బాధితులు గురువారం సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు ఈమెయిల్స్ పంపి, ఇంత భారీఎత్తున మోసం చేసిన ఘటన రా ష్ట్రంలో ఇదే మొదటిది. బాధితుడు అమెరికన్ సిటిజన్ అని, అందుకే డాలర్లలో చెల్లింపులు జరిగాయని పోలీసులు పేర్కొంటున్నారు.